Image credit: IPL
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్లతో గొడవ పడడంతో అతన్ని వీర లెవెల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కొందరు రోహిత్ శర్మ ఫ్యాన్స్. చిన్న పిల్లలు కూడా కోహ్లీని చూసి భయపడడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని మీమ్స్ వైరల్ చేశారు..
తాజాగా ఐపీఎల్ 2023 సీజన్లో వరుసగా రెండోసారి డకౌట్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ట్రోల్స్ మెటిరీయల్ అయిపోయాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 బంతులు ఆడి డకౌట్ అయిన రోహిత్ శర్మ, సీఎస్కేతో మ్యాచ్లో వన్డౌన్లో బ్యాటింగ్కి వచ్చాడు...
అయినా కూడా లక్ మారలేదు. దీపక్ చాహార్ బౌలింగ్లో రివర్స్ స్కూప్ షాట్కి ప్రయత్నించిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. సీఎస్కేతో మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ సరిగ్గా 3 బంతులే ఆడి డకౌట్ అయ్యాడు..
మహేంద్ర సింగ్ ధోనీ, ఆఖరి 3 బంతులు ఆడి ఒకటి రెండు సిక్సర్లు కొడుతుంటే, రోహిత్ శర్మ మొదటి 3 బంతులు ఆడి డకౌట్ అవుతున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు... గత సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన రోహిత్, ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో అర్ధ శతకం అందుకున్నా ఫామ్ని మాత్రం కొనసాగించలేకపోయాడు..
Rohit Sharma Ducks
రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 3 పరుగులు చేసిన రోహిత్ శర్మ, గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 2 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్సీబీతో మ్యాచ్లో 10 బంతులాడి 1 పరుగు చేశాడు. ఈ సీజన్లో రోహిత్ శర్మ బ్యాటు నుంచి రెండు సున్నాలు, 1, 2, 3 పరుగులు రావడంతో ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి..
గత సీజన్లో కూడా రోహిత్ శర్మ పేలవ ఫామ్, ముంబై ఇండియన్స్ని తీవ్రంగా ఇబ్బందిపెట్టింది. ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.