ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఈవెంట్ రద్దు?
క్రిక్బజ్ నివేదిక ప్రకారం నవంబర్ 11న లాహోర్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్ను రద్దు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్ణయించింది. 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు జరిగే ఎనిమిది జట్ల 50 ఓవర్ల టోర్నమెంట్లో భారతదేశం పాల్గొనే విషయంలో, టోర్నమెంట్ షెడ్యూల్పై కొనసాగుతున్న విభేదాల కారణంగా రద్దు చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగనుంది. మార్చి 10 బ్యాకప్ డేగా ఉంచారు. లాహోర్లో జరిగే ఫైనల్తో సహా 7 మ్యాచ్లతో లాహోర్, కరాచీ, రావల్పిండి మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లనందున, దాని మ్యాచ్ల వేదికను నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ను భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో పాటు గ్రూప్ ఏ లో ఉంచారు. గ్రూప్ బీ లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.