ఆరంభంలో ఇంగ్లాండ్ జోరు.. మధ్యలో వరుణ్ చక్రవర్తి సైక్లోన్
తొలుత బ్యాటింగ్ కు వచ్చిన వెంటనే ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ పై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఇంగ్లాండ్ పతనం మొదలైంది.
రాజ్కోట్లో వరుణ్ చక్రవర్తి తన పంజా విప్పడంతో ఇంగ్లిష్ జట్టు పేకమేడలా కూలిపోయింది. వరుణ్ చక్రవర్తి మరోసారి తన కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదుచేస్తూ 5 వికెట్లు తీసుకున్నాడు. 20 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్ 51 పరుగులు, లివింగ్ స్టోన్ 43 పరుగులు, జోస్ బట్లర్ 24 పరుగులు ఇన్నింగ్స్ ఆడారు.