INDvsENG: తొలి టెస్టులో టీమిండియా ఓటమి... విరాట్ కోహ్లీ రికార్డు ఫీట్ వృథా...

Published : Feb 09, 2021, 01:37 PM ISTUpdated : Feb 09, 2021, 01:40 PM IST

చెన్నై టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం చవి చూసింది. 420 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా, 192 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ 72 పరుగులతో రాణించినా, భారత జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఆస్ట్రేలియా టూర్‌లో సిరీస్ విజయం తర్వాత ఓటమితో ఇంగ్లాండ్ టూర్‌ను ఆరంభించింది టీమిండియా.  

PREV
110
INDvsENG: తొలి టెస్టులో టీమిండియా ఓటమి... విరాట్ కోహ్లీ రికార్డు ఫీట్ వృథా...

ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన భారత సారథి విరాట్ కోహ్లీని, బెన్ స్టోక్స్ పెవిలియన్ చేర్చాడు. 179 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా, ఓటమి అంచున నిలిచింది. 104 బంతుల్లో 9 ఫోర్లతో 72 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, బెన్‌ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన భారత సారథి విరాట్ కోహ్లీని, బెన్ స్టోక్స్ పెవిలియన్ చేర్చాడు. 179 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా, ఓటమి అంచున నిలిచింది. 104 బంతుల్లో 9 ఫోర్లతో 72 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, బెన్‌ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

210

చెన్నైలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా, హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు ఈ వేదికపై 1988లో లోగీ చేసిన 67 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఏ కెప్టెన్ కూడా ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో 30+ స్కోరు చేయలేకపోయారు.

చెన్నైలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా, హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు ఈ వేదికపై 1988లో లోగీ చేసిన 67 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఏ కెప్టెన్ కూడా ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో 30+ స్కోరు చేయలేకపోయారు.

310

రోహిత్ శర్మ (12) వికెట్‌ కోల్పోయి 39/1 ఓవర్‌నైట్ స్కోరు వద్ద ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 38 బంతుల్లో 15 పరుగులు చేసిన పూజారాను, జాక్ లీచ్ అవుట్ చేశాడు. 

రోహిత్ శర్మ (12) వికెట్‌ కోల్పోయి 39/1 ఓవర్‌నైట్ స్కోరు వద్ద ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 38 బంతుల్లో 15 పరుగులు చేసిన పూజారాను, జాక్ లీచ్ అవుట్ చేశాడు. 

410

83 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు పూర్తిచేసుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌ను జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్ అవుటైన ఓవర్‌లోనే వైస్ కెప్టెన్ అజింక రహానే కూడా పెవిలియన్ చేరాడు. 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇండియా...

83 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు పూర్తిచేసుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌ను జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్ అవుటైన ఓవర్‌లోనే వైస్ కెప్టెన్ అజింక రహానే కూడా పెవిలియన్ చేరాడు. 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇండియా...

510

మొదటి ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో రాణించిన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్. 110 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా...

మొదటి ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో రాణించిన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్. 110 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా...

610

ఆ తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులతో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్, డకౌట్ అయ్యాడు. డామ్ బెస్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు సుందర్. రెండో టెస్టు ఆడుతున్న సుందర్‌కి ఇది టెస్టుల్లో తొలి డకౌట్...

ఆ తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులతో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్, డకౌట్ అయ్యాడు. డామ్ బెస్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు సుందర్. రెండో టెస్టు ఆడుతున్న సుందర్‌కి ఇది టెస్టుల్లో తొలి డకౌట్...

710

117 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియాను రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కానీ 46 బంతుల్లో 9 పరుగులు చేసిన అశ్విన్‌ను జాక్ లీచ్ అవుట్ చేశాడు.

117 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియాను రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కానీ 46 బంతుల్లో 9 పరుగులు చేసిన అశ్విన్‌ను జాక్ లీచ్ అవుట్ చేశాడు.

810

అశ్విన్ అవుటైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అవుట్ కావడంతో ఓటమి ఖరారు చేసుకుంది టీమిండియా... తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన షాబజ్ నదీం, రెండో ఇన్నింగ్స్‌లో కూడా పరుగులేమీ చేయకుండానే జాక్ లీచ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

అశ్విన్ అవుటైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అవుట్ కావడంతో ఓటమి ఖరారు చేసుకుంది టీమిండియా... తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన షాబజ్ నదీం, రెండో ఇన్నింగ్స్‌లో కూడా పరుగులేమీ చేయకుండానే జాక్ లీచ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

910

ఇషాంత్ శర్మ హిట్ వికెట్ నుంచి తప్పించుకున్నా ఆర్చర్ బౌలింగ్‌లో బుమ్రా అవుట్ కావడంతో 192 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. ఇంగ్లాండ్ జట్టుకి 227 పరుగుల భారీ విజయం దక్కింది.

ఇషాంత్ శర్మ హిట్ వికెట్ నుంచి తప్పించుకున్నా ఆర్చర్ బౌలింగ్‌లో బుమ్రా అవుట్ కావడంతో 192 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. ఇంగ్లాండ్ జట్టుకి 227 పరుగుల భారీ విజయం దక్కింది.

1010

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో స్వదేశంలో చివరిసారిగా 2017లో టెస్టు మ్యాచ్ ఓడిన టీమిండియా, నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో పరాజయం చవిచూసింది. 1999లో పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్ ఓడిన తర్వాత చెన్నైలో భారత జట్టుకి దక్కిన ఓటమి ఇదే. 

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో స్వదేశంలో చివరిసారిగా 2017లో టెస్టు మ్యాచ్ ఓడిన టీమిండియా, నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో పరాజయం చవిచూసింది. 1999లో పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్ ఓడిన తర్వాత చెన్నైలో భారత జట్టుకి దక్కిన ఓటమి ఇదే. 

click me!

Recommended Stories