ఆస్ట్రేలియా టూర్లో 50 శాతం ప్రేక్షకుల మధ్య మ్యాచులు ఆడిన టీమిండియా... స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే మ్యాచుల విషయంలో మాత్రం ఆ సాహసం చేయలేకపోతోంది.
undefined
ముందుగా నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్కి 50 శాతం ప్రేక్షకులను అనుమతించాలని భావించింది బీసీసీఐ. అయితే ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ భయం వ్యక్తం చేయడంతో పాటు రిస్క్ చేయడం లేక డోర్లు మూసి మ్యాచులు నిర్వహించనున్నారు.
undefined
టెస్టులకు అనుమతి లేకున్నా, టీ20 సిరీస్ను మాత్రం జనాల మధ్య నిర్వహించాలని భావిస్తోంది భారత క్రికెట్ బోర్డు.
undefined
నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత మార్చి 12 నుంచి ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
undefined
దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం సర్దార్ పటేల్ స్టేడియం, మొతెరాలో ఈ టీ20 మ్యాచులన్నీ జరగనున్నాయి...
undefined
టీ20 మ్యాచులకు భారతదేశంలో క్రేజ్ చాలా ఎక్కువ. అందులోనూ భారీ స్టేడియం కాబట్టి 50 శాతం జనాలు హాజరైనా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవచ్చని బీసీసీఐ ఆలోచన...
undefined
ఐదు మ్యాచులు ఒకే వేదికపైన జరుగుతుండడంతో కరోనా నిబంధనలకు తగ్గట్టుగా స్టేడియాన్ని తీర్చి దిద్దడం కూడా బీసీసీఐకి తేలికైన పని...
undefined
భారత్, ఇంగ్లాండ్ మధ్య మొదటి రెండు టెస్టులు చెన్నైలోని చిందబరం స్టేడియంలో జరగనున్నాయి. ఈ టెస్టులు పూర్తిగా మూసేసిన స్టేడియంలో జరగనున్నాయి...
undefined
ఐపీఎల్ 2020 సీజన్లో మాదిరిగానే ఆర్టిఫిషియల్ సౌండ్లతో స్టేడియంలో జనాలు ఉన్నారనే ఫీలింగ్ కలిగించబోతున్నారు...
undefined
రెండు టెస్టులు ముగిసిన తర్వాత అహ్మదాబాద్ చేరుకునే భారత జట్టు అక్కడ చివరి రెండు టెస్టులతో పాటు ఐదు టీ20 మ్యాచులను ఆడబోతోంది...
undefined
మూడు వన్డేల సిరీస్ను పూణెలోని మహ్మత్మా గాంధీ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడబోతున్నాయి భారత్, ఇంగ్లాండ్ జట్లు...
undefined
టీ20 సిరీస్ల ఫలితాన్ని బట్టి వన్డే సిరీస్కి ప్రేక్షకులను అనుమతించాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించబోతున్నారు...
undefined