INDvsAUS: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా... భార్యా పిల్లలతో కలిసి... విరాట్ మాత్రం అలా...
First Published Nov 13, 2020, 10:17 AM ISTIPL 2020 సీజన్కి ముగింపు కార్డు పడిన రెండో రోజు ఆస్ట్రేలియా గడ్డ మీద వాలిపోయింది భారత క్రికెట్ బృందం. ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్తో పాటు మూడు టీ20, మూడు వన్డే మ్యాచుల సిరీస్లను కూడా ఆడనుంది. కరోనా నిబంధనల కారణంగా 14 రోజుల ముందే ఆస్ట్రేలియా చేరిన భారత బృందం... అక్కడ క్వారంటైన్లో గడుపుతోంది. రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ సిరీస్కు క్రికెటర్లతో పాటు వారి కుటుంబాన్ని కూడా అనుమతించింది బీసీసీఐ. దీంతో ఆసీస్ టూర్కి ఎంపికైన క్రికెటర్లు అందరూ భార్యాపిల్లలతో అక్కడ వాలిపోయారు.