అందుకే ఫైనల్ చూడట్లేదు, నా సపోర్టు ఆ టీమ్‌కే... ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్...

First Published Jun 23, 2021, 6:14 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని మాత్రం అందించలేకపోయింది. దీనికి ఒకే ఒక్క కారణం సౌంతిప్టన్‌లోని వాతావరణం. క్రికెట్ ఫ్యాన్సే కాదు, చాలామంది క్రికెటర్లు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చూడడం లేదట...

భారత జట్టు ఆడే ప్రతీ మ్యాచ్‌ని వీక్షిస్తుంటాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇండియాని తన రెండో ఇల్లుగా ప్రకటించిన డేవిడ్ వార్నర్, భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లపై తనకున్న అభిమానాన్ని చాలాసార్లు బహిరంగంగా ప్రకటించాడు కూడా...
undefined
సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే డేవిడ్ వార్నర్, తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్లిన ఫోటోలను పోస్టు చేసిన డేవిడ్ వార్నర్, అభిమానులకు కామెంట్లకు సమాధానాలు ఇచ్చాడు...
undefined
‘మీరు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ చూడడం లేదు కదా...’ అంటూ ఓ అభిమాని ప్రశ్నకు సమాధానం ఇచ్చిన డేవిడ్ వార్నర్... ‘అవును, సౌంతిప్టన్‌లో ఫుల్లుగా వర్షం పడుతుందని అనుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు...
undefined
‘మీరు ఫైనల్ మ్యాచ్‌లో ఎవరికి సపోర్టు చేస్తున్నారని’ డేవిడ్ వార్నర్‌ని చాలామంది ప్రశ్నించారు. డేవిడ్ వార్నర్‌కి విరాట్ కోహ్లీ, టీమిండియా అంటే ప్రత్యేకమైన అభిమానం కాగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ అంటే ప్రత్యేకమైన ప్రేమ...
undefined
అయితే డేవిడ్ వార్నర్ దీనికి పర్ఫెక్ట్ వివరణ ఇచ్చాడు. ఓ అభిమాని... ‘డేవిడ్ వార్నర్, నీలో ఓ ఇండియన్ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎవరికి సపోర్టు చేస్తున్నావని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు’ అంటూ ట్వీట్ చేశాడు...
undefined
దానికి సమాధానం ఇచ్చిన డేవడ్ వార్నర్... ‘అవును... ఈ విషయం చాలామందికి తెలుసు, అయినా ఎందుకు అడుగుతారో అర్థం కాదు...’ అంటూ చెప్పుకొచ్చాడు...
undefined
సౌంతిప్టన్‌లో వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట రద్దు కావడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆసక్తి బాగా తగ్గిపోయింది...
undefined
click me!