తొలిసారి జరుగుతున్న డబ్ల్యూపీఎల్ పై క్రేజ్ పెంచేందుకు గాను బీసీసీఐ పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. మహిళలకు స్టేడియాల్లోకి ఉచిత ఎంట్రీ.. టికెట్ల రుసుములు నామమాత్రం (రూ. 100, రూ . 200, రూ. 250) గానే ఉంచింది. వీటితో పాటు బౌండరీ లైన్ ను 60 మీటర్లకు కుదించింది. మార్చి 4న గుజరాత్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు ముందే బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.