పోలార్డ్ తర్వాత హార్ధిక్ పాండ్యా... సరికొత్త రికార్డు నెలకొల్పిన భారత ఆల్‌రౌండర్...

First Published Dec 7, 2020, 5:26 PM IST

హార్ధిక్ పాండ్యా భారీ సిక్సర్లు కొట్టడం ఇప్పుడే కొత్త కాదు. ఐపీఎల్‌లో సిక్సర్ల మోత కారణంగానే హార్ధిక్ పాండ్యాకి భారత జట్టులో స్థానం దక్కింది. అయితే ముంబై ఇండియన్స్‌కి ఆడిన ఇన్నింగ్స్‌లతో పోలిస్తే, టీమిండియా తరుపున ఇన్నాళ్లు పెద్దగా పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు హార్ధిక్ పాండ్యా. అదీకాకుండా పాండ్యాను గాయాలు వెంటాడాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. తండ్రి అయిన తర్వాత కూల్ అండ్ కామ్‌గా తయారైన హార్ధిక్ పాండ్యా, ఆసీస్ టూర్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

ఆస్ట్రేలియాలో ఒకే టూర్‌లో వన్డే, టీ20 సిరీస్‌ రెండింటిలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలచుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా. 2013లో కిరన్ పోలార్డ్ ఈ ఘనత సాధిస్తే, 2020లో హార్ధిక్ పాండ్యా మూడో వన్డేలో, రెండో టీ20లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
undefined
మూడు దేశాలపై మూడు ఫార్మాట్లలోనూ సిరీస్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ... శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై స్వదేశంలోనూ, విదేశంలోనూ టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను గెలిచి సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్...
undefined
భారత బౌలర్ నటరాజన్ లేకుండా టీమిండియా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. నటరాజన్ ఎంట్రీ తర్వాత మూడు మ్యాచుల్లో విజయం సాధించింది...
undefined
మరోవైపు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా తప్పుకున్న తర్వాత జరిగిన మూడు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియాకి పరాజయమే దక్కింది....
undefined
2012లో ఆస్ట్రేలియాలో మహేంద్ర సింగ్ ధోనీ 112 మీటర్ల భారీ సిక్సర్ బాదితే... 2020లో శ్రేయాస్ అయ్యర్ గత టీ20 మ్యాచ్‌లో 111 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు..
undefined
ధోనీ, కోహ్లీ తర్వాత అత్యధిక సార్లు టీ20 మ్యాచ్‌ను సిక్సర్‌తో ముగించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా. ధోనీ, కోహ్లీ మూడేసి సార్లు ఈ ఫీట్ చేయగా హార్ధిక్ పాండ్యా రెండు సార్లు సిక్సర్‌తో ముగించాడు.
undefined
టీ20 మ్యాచ్‌లో అత్యధిక 25+ భాగస్వామ్యాలు నెలకొన్న రెండో మ్యాచ్‌గా నిలిచింది ఆసీస్, భారత్ మధ్య జరిగిన రెండో టీ20. ఇంతకుముందు 2010లో ఆస్ట్రేలియా, పాక్ మధ్య జరిగిన టీ20లో తొమ్మిది 25+ భాగస్వామ్యాలు నమోదుకాగా, రెండో టీ20లోనూ 9సార్లు 25+ పార్టనర్‌షిప్ నమోదైంది.
undefined
click me!