3. పాకిస్తాన్ పై శివతాండవం: 2003 వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్ చేరడంలో సచిన్ ది కీలక పాత్ర. ఈ టోర్నీలో భారత్ - పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో సచిన్ శివతాండవం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. భారత్ ముందు 274 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అవతలి వైపు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయభ్ అక్తర్, సక్లయిన్ ముస్తాక్ లను ధీటుగా ఎదుర్కున్నాడు. 75 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సచిన్.. షోయభ్ అక్తర్ బౌలింగ్ లో డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా కొట్టిన సిక్సర్ ను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు.