ఇక సిడ్నీ టెస్టులో ఆఖరిదాకా అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచులో ఇంగ్లాండ్ గొప్పగా పోరాడి.. మ్యాచును డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగో ఇన్నింగ్సులో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు.. 9 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. ఆఖర్లో బ్రాడ్-జేమ్స్ అండర్సన్ లు పట్టుదలగా ఆడి ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు.