కాగా నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 177 పరుగులకే కుప్పకూలింది. తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400 రన్స్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్.. సెంచరీ (120) తో చెలరేగాడు. జడేజా, అక్షర్ కూడా రాణించారు. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్లు కనీసం పిచ్ లో పట్టుమని పది నిమిషాలు కూడా నిలువడానికే తంటాలుపడ్డారు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఆ జట్టు బ్యాటర్లలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు.