కడక్నాథ్ కోళ్ల ఫారం పెడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ... రెండు వేల కోళ్లకి ఆర్డర్...
First Published Nov 13, 2020, 5:40 PM ISTగత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... ఇప్పుడు తన ఫేవరెట్ వ్యవసాయంపైనే పూర్తి ఫోకస్ మళ్లించాడట. బ్రాండ్ అంబాసిడర్గా కొన్ని వేల కోట్లు ఆర్జించిన భారత కూల్ కెప్టెన్ ధోనీ మనసు ఇప్పుడు నల్లగా నిగనిగలాడే కడక్నాథ్ కోళ్లపైకి మళ్లిందట. రాంఛీలోని తన ఫామ్ హౌస్లో ఈ కోళ్లను పెంచబోతున్నాడట ధోనీ.