చిక్కుల్లో బిసీసీఐ: జయ్ షా అవుట్, గంగూలీకీ కూడా ఎసరు

First Published Jul 3, 2020, 3:11 PM IST

బీసీసీఐకి ఇప్పుడు కార్యదర్శి ఉన్నారా? ఉంటే ఆ కార్యదర్శి ఎవరు?.... సాధారణంగా అందరము అమిత్ షా తనయుడు జయ్ షా ఉండగా ఈ ప్రశ్నేమిటి అని అనవచ్చు. కానీ బీసీసీఐ పెద్దలను ఎవ్వరిని ఈ ప్రశ్న అడిగినా వారి వద్ద సమాధానం లేదు. 

బీసీసీఐ లో విచిత్రకరమైన సంకట పరిస్థితులు నెలకొన్నాయి. లోధా కమిట సిఫారసుల పుణ్యమాని ఇప్పుడు బీసీసీఐ కి దిక్కు మొక్కు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏదో అనుకోకుండా అనూహ్యంగా వచ్చిపడింది కాదు. బీసీసీఐ పెద్దలకు ఎప్పటినుండో తెలిసినప్పటికీ... వారు చేజేతులా కొని తెచ్చుకున్న పరిస్థితి. ఆ పరిస్థితులేమిటో ఒకసారి చూద్దాము.
undefined
బీసీసీఐకి ఇప్పుడు కార్యదర్శి ఉన్నారా? ఉంటే ఆ కార్యదర్శి ఎవరు?.... సాధారణంగా అందరము అమిత్ షా తనయుడు జయ్ షా ఉండగా ఈ ప్రశ్నేమిటి అని అనవచ్చు. కానీ బీసీసీఐ పెద్దలను ఎవ్వరిని ఈ ప్రశ్న అడిగినా వారి వద్ద సమాధానం లేదు.ఈ విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. కారణం జయ్ షా పదవి కాలం ముగిసిపోయింది.ప్రపంచ అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు ఎందుకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది?. నిజానికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే సంగతి బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లకు ముందే తెలుసు.
undefined
అయినా, జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులు, సుప్రీంకోర్టు ఆదేశాలు, బీసీసీఐ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశం ఈ పరిస్థితి తలెత్తే నిర్ణయం తీసుకుంది!. ఇప్పుడు సుపరిపాలన, కరోనా కష్టకాలం, క్రికెట్‌ సవాళ్ల పేరుతో సుప్రీంకోర్టు తలుపు తడుతోంది.నూతన రాజ్యాంగం అనుసారం బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో కలిపి వరుసగా ఆరేండ్లు మాత్రమే పదవీలో కొనసాగేందుకు వీలుంది. ఆరేండ్ల అనంతరం కచ్చితంగా మూడేండ్లు అన్ని పదవులకు (క్రికెట్‌ పరిపాలన) దూరంగా ఉండాలి.
undefined
ఆ నిబంధనల ప్రకారం జై షా కార్యదర్శి పదవీకాలం జూన్‌ 30తో ముగిసిపోయింది. జులై 27న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పదవీ కాలం ముగియనుంది. ఇప్పుడు కార్యదర్శి ఎవరో తెలియని సందిగ్థంలో పనిచేస్తోన్న బీసీసీఐ.. మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడు ఉన్నారో లేదో తెలియని సంకటి స్థితిలో పనిచేయాల్సిన పరిస్థితి ముంచుకొస్తుంది.బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు బోర్డుకు కార్యదర్శి లేరు. జులై 27 తర్వాత బోర్డుకు అధ్యక్షుడు కూడా ఉండబోరు. ఇది అక్షర సత్యం. గంగూలీ పదవీకాలం కూడా జులై 27న ముగియనుంది.
undefined
టెక్నికల్ గా మాట్లాడితే....జూన్‌ 1 నుంచి బీసీసీఐకి కార్యదర్శి లేరు. నిబంధనల ప్రకారం కార్యదర్శి పదవీకాలం ముగియటంతో.. తాత్కాలిక కార్యదర్శి బాధ్యతలు ఎవరు తీసుకున్నారనే విషయమై బీసీసీఐ ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఎటువంటి సమాచారం రావటం లేదు.ఈ పరిణామానికి బీసీసీఐ ఉన్నతాధికారులు ముందుగానే సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. బీసీసీఐ వెబ్‌సైట్‌లో ఆఫీస్‌ బేరర్ల సమాచారం ఉండటం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీస్‌ బేరర్ల పేర్లను వెబ్‌సైట్‌లో ఉంచటం, సాంకేతికంగా న్యాయస్థానంలో సమస్యలు వస్తాయని అప్రమత్తమయ్యారు.
undefined
నిబంధనల ప్రకారం ఆఫీస్‌ బేరర్ల జాబితా నుంచి జై షా (బీజేపీ మాజీ అధ్యక్షుడు, హౌం శాఖ మంత్రి అమిత్‌ షా కుమారుడు) పేరు తొలగించాలి. అదే జరిగితే, అనంతరం బీసీసీఐ టెక్నికల్‌ టీమ్‌ చీఫ్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదు!. అందుకే ఆఫీస్‌ బేరర్లు అందరి పేర్లను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. కార్యదర్శిపై సమాచారం కోసం ఎవరు సంప్రదించినా, ఉన్నతాధికారులు స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.
undefined
సుప్రీంకోర్టు తలుపుతట్టిన పెద్దలు:జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కమిటీ సిఫారసుల ప్రకారం రాష్ట్ర క్రికెట్‌ సంఘం, బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేండ్లకు మించి పదవిలో ఉండేందుకు అవకాశం లేదు. కచ్చితంగా మూడేండ్లు బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు దూరంగా ఉండాల్సిందే. గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ) అధ్యక్షుడిగా అమిత్‌ షా కొనసాగిన సమయంలో అతని కుమారుడు జై షా సంయుక్త కార్యదర్శిగా జీసీఏలో అడుగుపెట్టాడు.
undefined
2020 జూన్‌ 30తో జీసీఏ, బీసీసీఐలో కలుపుకుని జై షా ఆరేండ్ల పదవీ కాలం ముగిసింది. జూన్‌ 30తో పదవీ కాలం ముగియడానికి ముందే, జై షా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా కష్ట కాలంలో క్రికెట్‌ సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో పదవీలో కొనసాగేందుకు అనుమతించాలని జై షా పిటిషన్‌ దాఖలు చేసినట్టు సమాచారం. దీనిపై జై షా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
undefined
జూన్‌ 30తో జై షా, జులై 27తో సౌరవ్‌ గంగూలీ పదవీకాలం ముగియనుండటంతో బీసీసీఐ ఇదివరకే సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మూడేండ్ల విరామ సమయం నిబంధన మార్పు చేసేందుకు, రాజ్యాంగ సవరణకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషను వేసింది. బీసీసీఐ రాజ్యాంగ సవరణలకు సుప్రీంకోర్టు అనుమతి అవసరం అక్కర్లేకుండా చూడాలని సైతం పిటిషనులో విన్నవించింది. బీసీసీఐ పిటిషను సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది.
undefined
ఐపీఎల్ ప్రకటన పై ఆలస్యముందుకే...!ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తాత్కాలిక షెడ్యూల్‌, విదేశీ కంపెనీల స్పాన్సర్‌షిప్‌లపై సమీక్ష చేసేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం కావాల్సి ఉంది. గత వారంలోనే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయినా, చోటుచేసుకోలేదు. అందుకు బోర్డు అధికారులు ఇతర కారణాలు చెబుతున్నా.. పదవీ కాలం ముగిసిపోయిన కార్యదర్శిపై స్పష్టత లేకపోవటమేనని తెలుస్తోంది.
undefined
click me!