ఫైనల్ ఎఫెక్ట్.... ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు ఆ మ్యాచులు ఆడనున్న టీమిండియా...

First Published Jun 26, 2021, 4:22 PM IST

చేతులు కాలిన తర్వాత కానీ ఆకులు విలువ తెలీదు... ఇది ఇప్పుడు టీమిండియాకి సరిగ్గా సూట్ అయ్యే సామెత. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌ మ్యాచ్‌లో ఓడిన టీమిండియా... ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కి ముందు పక్కా ప్రణాళికలు రచిస్తోంది...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందే ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడింది న్యూజిలాండ్. అందులో రెండో టెస్టు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది కూడా.
undefined
ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆతిథ్య జట్టుపై దక్కిన ఆ విజయం అటు న్యూజిలాండ్ కాన్ఫిడెన్స్‌ని రెండింతలు పెంచితే, టీమిండియాలో ఎక్కడో ఓ మూల ఓటమి భయాన్ని సృష్టించగలిగింది.
undefined
అందుకే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో చర్చలు జరుపుతోంది బీసీసీఐ...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు ఐపీఎల్‌లో పాల్గొన్న భారత క్రికెటర్లు, ఆ తర్వాత ఎలాంటి క్రికెట్‌లోనూ పాల్గొనలేదు. నెట్ ప్రాక్టీస్ చేసినా, ఇంట్రా స్వార్డ్ మ్యాచు ఆడినా అది ప్రాక్టీస్ మ్యాచ్‌తో సమానం కాదు. అసలైన మ్యాచ్ ఆడుతున్న ఫీలింగ్ ఇవ్వలేదు...
undefined
‘బీసీసీఐ సెక్రటరీ జే షా, ఈసీబీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హారీసన్‌తో రెండు వామప్ మ్యాచులు ఆడేందుకు చర్చలు జరుపుతున్నారు.
undefined
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కనీసం రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఉంటే... టెస్టు సిరీస్‌కి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావడానికి సమయం దొరుకుతుంది’ అంటూ తెలిపారు బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమల్.
undefined
ఫైనల్ మ్యాచ్ తర్వాత టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు 41 రోజుల లాంగ్ గ్యాప్‌ ఉంది. ఇందులో 21 రోజులు క్రికెటర్లు హాలీడేస్‌లో ఉండబోతున్నారు. కొందరు వింబుల్డన్ మ్యాచులు, మరికొందరు యూరో ఫుల్‌బాల్ మ్యాచులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
undefined
ఆ తర్వాత 20 రోజుల ముందుగానే టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెడతారు టీమిండియా క్రికెటర్లు. ఈ సమయంలో ఇంగ్లాండ్ కౌంటీ జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఏర్పాటు చేయాలని చూస్తోంది బీసీసీఐ...
undefined
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు... ప్రస్తుతం శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత పాకిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడుతుంది ఇంగ్లాండ్. ఆ తర్వాత భారత జట్టుతో టెస్టు సిరీస్ ఆరంభమవుతుంది.
undefined
click me!