శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. తొలి వన్డేలో ఉన్నది తక్కువసేపే అయినా రాహుల్ మెరుపులు మెరిపించాడు. అలాగే రెండో వన్డేలో 216 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 62 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో బ్యాటింగ్ కు వచ్చి శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.