రెండో టెస్టు మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో అన్ని వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులకే పరిమితమైంది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ లిట్టన్ దాస్ 138 పరుగులు సాధించాడు. మెహిదీ హసన్ మిరాజ్ 78 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ 12 పరుగులు వెనుకపడింది.
అయితే, 12 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన పాకిస్తాన్ ఘోరమైన ఆటతో చాలా త్వరగానే ఆలౌట్ అయింది. కేవలం 172 పరుగులకే పాక్ జట్టు కుప్పకూలింది. ఇందులో మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులు చేయగా, ఆగా సల్మాన్ 47 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మిగతా ప్లేయర్లు చేతులెత్తేశారు.