కాగా.. పాకిస్తాన్, తటస్థ వేదిక మినహా శ్రీలంకలో ఆసియా కప్ను నిర్వహిస్తే తాము ఈ టోర్నీని బహిష్కరిస్తామని ఇదివరకే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏసీసీ, బీసీసీఐ అధికారులు చేస్తున్న ప్రకటనలు ఈ విషయంలో మరింత గందరగోళాన్ని పెంచాయి. ఒకవేళ ఆసియా కప్ లో ఆడకుంటే పాకిస్తాన్.. సౌతాఫ్రికా, జింబాబ్వేతో ట్రై సిరీస్ నిర్వహించాలని, ఆ మేరకు ఇదివరకే ఇరు దేశాలతో చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది.