వాస్తవానికి హాంగ్జౌలో జరగాల్సి ఉన్న ఆసియా గేమ్స్ గతేడాది నాటివి. కానీ కరోనా కారణంగా వాటిని ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇక ఆసియా గేమ్స్ గత ఎడిషన్ లో భారత జట్టు 70 మెడల్స్ తో సత్తా చాటింది. ఇందులో 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈసారి కూడా స్వర్ణాల సంఖ్యను పెంచుకునేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది.