భారత క్రికెట్ మాజీ సారథులు విరాట్ కోహ్లీ.. రాహుల్ కు రూ. 2.17 కోట్లు విలువ చేసే ఖరీదైన కారును, మహేంద్ర సింగ్ ధోని రూ. 80 లక్షల కవాసకీ నింజా బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చారని కూడా పలు జాతీయ మీడియాలలో, సోషల్ మీడియాలో పుంకానుపుంకాలుగా కథనాలు వచ్చాయి. అయితే అటు రాహుల్ గానీ, ఇటు అతియా శెట్టి ఫ్యామిలీ గానీ దీని మీద అధికారిక ప్రకటన చేయలేదు.