ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించే జట్టు ఇదే... ఆకాశ్ చోప్రా వరల్డ్ బెస్ట్ ఎలెవన్, టీమిండియా నుంచి ముగ్గురే...

First Published Jun 29, 2021, 11:27 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. దీంతో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా... న్యూజిలాండ్‌ ఓడించగల సత్తా ఉన్న 11 మంది ప్లేయర్లతో వరల్డ్ బెస్ట్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచి, ఫైనల్‌కి అర్హత సాధించినా... ఆకాశ్ చోప్రా ప్రకటించిన వరల్డ్ ఎలెవన్‌లో అతనికి చోటు కూడా దక్కలేదు...
undefined
టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచిన రోహిత్ శర్మను, తన టీమ్‌కి ఓపెనర్‌గా ఎంచుకున్నాడు ఆకాశ్ చోప్రా...
undefined
రోహిత్ శర్మ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో 12 మ్యాచులు ఆడి, 19 ఇన్నింగ్స్‌ల్లో 1094 పరుగులు చేసి, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
undefined
కరుణరత్నే... శ్రీలంక ఓపెనర్ కరుణ రత్నేని, రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌గా ఎంచుకున్నాడు ఆకాశ్ చోప్రా. కరుణరత్నే 10 మ్యాచుల్లో 999 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి..
undefined
మార్నస్ లబుషేన్: డబ్ల్యూటీసీ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషేన్. 13 మ్యాచుల్లో 1675 పరుగులు చేయగా, ఇందులో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి..
undefined
జో రూట్ (కెప్టెన్): ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌ను, తన జట్టుకి కెప్టెన్‌గా ఎంచుకున్నాడు జో రూట్. టోర్నీలో 20 మ్యాచులు ఆడిన జో రూట్, 1660 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.
undefined
స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, టోర్నీలో 13 మ్యాచులు ఆడి 1341 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...
undefined
బెన్ స్టోక్స్: ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఐసీసీ డబ్ల్యూటీసీ టోర్నీ 2020-21లో 17 మ్యాచులు ఆడి 1334 పరుగులతో అత్యధి పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.
undefined
రిషబ్ పంత్: భారత యంగ్ సెన్సేషన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తన జట్టుకి వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు ఆకాశ్ చోప్రా. పంత్, డబ్ల్యూటీసీ టోర్నీలో రిషబ్ పంత్ 12 మ్యాచులు ఆడి 707 పరుగులు చేశాడు.
undefined
ప్యాట్ కమ్మిన్స్: డబ్ల్యూటీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా, స్టార్ పేసర్‌గా నిలిచాడు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్. కమ్మన్స్ 14 మ్యాచుల్లో 70 వికెట్లు పడగొట్టాడు.
undefined
రవిచంద్రన్ అశ్విన్: డబ్ల్యూటీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు రవి అశ్విన్. అశ్విన్ 14 మ్యాచుల్లో 71 వికెట్లు తీశాడు.
undefined
స్టువర్ట్ బ్రాడ్: ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 17 మ్యాచుల్లో 69 వికెట్లు తీసి, టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
జోష్ హజల్‌వుడ్: ఆసీస్ సీనియర్ పేసర్ జోష్ హజల్‌వుడ్ 11 మ్యాచుల్లో 48 వికెట్లు తీశాడు.
undefined
ఆకాశ్ చోప్రా ప్రకటించిన జట్టులో భారత జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన అజింకా రహానేకి, టీమిండియాను ఫైనల్‌కి చేర్చిన విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం విశేషం.
undefined
click me!