
Shardul Thakur: దాదాపు భారత జట్టు స్టార్ సీనియర్ ప్లేయర్లు అందరూ రంజీ ట్రోఫీలో ఆడుతుండటంతో దేశవాళీ క్రికెట్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. క్రికెట్ లవర్స్ కు మస్త్ మజాను పంచుతోంది. ఇదే క్రమంలో పలువురు ప్లేయర్లు బ్యాట్, బాల్ తో అద్భుతం చేస్తున్నారు.
అలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఇప్పుడు ఒక భయంకరమైన బౌలర్ మళ్లీ టీమ్ ఇండియాలోకి తనను తీసుకోవాల్సిందేనంటూ తన సూపర్ బ్యాటింగ్, బౌలింగ్ తో సెలక్టర్లకు హింట్ ఇచ్చాడు. భారత్కు చెందిన ఈ 'కిల్లర్' బౌలర్ తన డెడ్లీ బౌలింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచేలా హ్యాట్రిక్ తో విధ్వంసం సృష్టించాడు. అతనే శార్దూల్ ఠాకూర్.
ఈ బౌలర్ తన కిల్లర్ బౌలింగ్తో ఏదైనా మ్యాచ్ని మలుపు తిప్పడంలో నిపుణుడు. రంజీ ట్రోఫీలో మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ భీకర ఫామ్ కనిపించింది. మేఘాలయతో జరిగిన ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ తొలి ఇన్నింగ్స్లో సంచలన బౌలింగ్ చేసి హ్యాట్రిక్ కొట్టాడు. శార్దూల్ ఠాకూర్ విధ్వంసం ముందు మేఘాలయ 3.1 ఓవర్లలో 2 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది.
భారత 'కిల్లర్' బౌలర్ శార్దూల్ ఠాకూర్
మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శార్దూల్ ఠాకూర్ రెండో ఓవర్లో హ్యాట్రిక్ సాధించి అద్భుతం చేశాడు. రెండో ఓవర్ చివరి మూడు బంతుల్లో మేఘాలయ బ్యాట్స్మెన్ బి అనిరుధ్ (0), సుమిత్ కుమార్ (0), జస్కీరత్ సింగ్ (0)లను అవుట్ చేయడం ద్వారా శార్దూల్ ఠాకూర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు.
టీమ్ ఇండియాకు దూరమైన తర్వాత శార్దూల్ ఠాకూర్ నిరంతరం అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. గత మ్యాచ్లో 33 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ జమ్ముకశ్మీర్పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. జమ్మూకశ్మీర్తో జరిగిన చివరి రంజీ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ తొలి ఇన్నింగ్స్లో 51 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 119 పరుగులు చేశాడు. అలాగే, రెండు వికెట్లు కూడా తీశాడు.
శార్దూల్ ఠాకూర్ కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చేనా?
డిసెంబర్ 2023లో భారత్ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి శార్దూల్ ఠాకూర్ టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్లో శార్దూల్ ఠాకూర్కు కూడా అవకాశం ఇవ్వలేదు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డిని ఎంపిక చేశారు.
తనను జట్టులోకి తీసుకోకపోవడంతో అతను తన బ్యాట్, బాల్ తో సంచలనం రేపుతూ సెలక్టర్లకు సమాధానమిచ్చాడు. జూన్ 2025లో ఇంగ్లండ్తో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్కు తనను తీసుకోవాల్సిందేనంటూ దీంతో సమాధానమిచ్చాడు.
క్రికెట్లో అత్యుత్తమ రికార్డులు కలిగిన శార్దూల్ టాకూర్
భారత క్రికెట్ లో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ గా శార్దూల్ ఠాకూర్ తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్ 11 టెస్టు మ్యాచ్ల్లో 31 వికెట్లు పడగొట్టడంతో పాటు 331 పరుగులు చేశాడు. అలాగే, 47 వన్డేల్లో 65 వికెట్లు, 25 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 33 వికెట్లు పడగొట్టాడు.
శార్దూల్ ఠాకూర్ వన్డేల్లో 329 పరుగులు, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 69 పరుగులు చేశాడు. 95 ఐపీఎల్ మ్యాచ్ల్లో శార్దూల్ ఠాకూర్ 94 వికెట్లు పడగొట్టి 307 పరుగులు చేశాడు. చాలా కాలంగా జాతీయ జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్న అతనికి మరోసారి జట్టులో చోటుదక్కుతుందో లేదో చూడాలి.