గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హోళీ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కారణంగా తెలుగురాష్ట్రాల ప్రజలు హోళీ వేడుకలకు దూరంగా వుండాలని ఇరు ప్రభుత్వాలు ప్రకటించింది. దీంతో తెలుగురాష్ట్రాల్లో పండగ కళ కనిపించడం లేదు. ప్రతిసారీ ఇళ్లలోంచి బయటకు వచ్చి రంగుల పండుగను జరుపుకునే ప్రజలు ఈసారి ఇళ్లకే పరిమితమయ్యారు.