ఖైదీలకు కరోనా... రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలకలం
First Published Apr 9, 2021, 2:11 PM ISTరాజమండ్రి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి తిరిగి వేగంగా విజృంభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా కరోనా కలకలం రేగింది. ఇప్పటికే 9మంది ఖైధీలు ఈ వైరస్ బారిన పడగా తాజాగా మరో 13మందికి కూడా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు కరోనా సోకిన ఖైధీలను ప్రత్యేకంగా ఓ బ్యారక్ లో క్వారంటైన్ చేశారు.