ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు: అదానీ, అంబానీ కాదు, మరి ఎవరు..?

Published : Aug 22, 2024, 01:00 PM IST

అత్యంత ధనవంతులు ఎవరు అనగానే అందరికీ.. అంబానీ, అదానీ, రతన్ టాటా ల పేర్లు వినపడతాయి. కానీ.. వారిని మించిన ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..

PREV
14
ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు: అదానీ, అంబానీ కాదు, మరి ఎవరు..?

మనకు ఇప్పటి వరకు తెలిసిన సంపన్నులు ముకేష్ అంబానీ, అదానీ, రతన్ టాటా.. వీళ్ల పేర్లే ఎక్కువగా వినపడతాయి. కానీ వారిని మించిన ధనవంతుడు ఉన్నాడు. అతను మరెవరో కాదు.. అతని పేరు మాన్సా మూసా, 14వ శతాబ్దపు ఆఫ్రికన్ చక్రవర్తి. అతను అత్యంత ధనవంతుడిగా పరిగణిస్తారు. మాంజా మూసా 1280ఏడీలో జన్మించాడు. 1312ఏడీలో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజయానికి పాలకుడు అయ్యాడు. ద్రవ్యోల్బనం అనుగుణంగా అతని సంపాదన సుమారు 400 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.

24

ఇది జెఫ్ బెజోస్ (USD 195.8 బిలియన్లు), ముఖేష్ అంబానీ (USD 194.6 బిలియన్లు), గౌతమ్ అధానీ (USD 117.8 బిలియన్లు), రతన్ టాటా (USD 83.6 బిలియన్లు) వంటి భారతీయ బిలియనీర్ల సంపద కంటే చాలా ఎక్కువ. మాన్సా మూసా  అపారమైన సంపద అతని సామ్రాజ్యం , విస్తారమైన సహజ వనరుల నుండి వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.

34

బంబుక్, వంగర, బూరే, కలాం , టకాసా వంటి ప్రాంతాల్లోని బంగారు గనుల వల్ల అతని సంపద ఉంది. అతని సామ్రాజ్యంలో టింబక్టు రాజధానిగా ఉన్న ప్రస్తుత దేశాలైన ఐవరీ కోస్ట్, సెనెగల్, మాలి , బుర్కినా ఫాసో ఉన్నాయి. మాన్సా మూసా కేవలం ధనవంతుడు మాత్రమే కాదు.. అతను చాలా ఉదారంగా ఉంటాడు. అతను జ్ఞానానికి కూడా పేరుగాంచాడు. అందరికీ బంగారు బహుమతులు ఇచ్చేవాడట.

44

1324లో, మాంజా మూసా మక్కాకు ప్రసిద్ధ తీర్థయాత్ర చేశాడు.   12,000 మంది సేవకులు , 60,000 మంది బానిసలతో పాటు పెద్ద మొత్తంలో బంగారాన్ని మోసుకెళ్ళే 100 ఒంటెలతో కూడి ఉంది. ఈ తీర్థయాత్రలో అతను 2022లో $957 మిలియన్ల విలువైన 18 టన్నుల బంగారాన్ని తీసుకెళ్లాడని అంచనా.

 

click me!

Recommended Stories