రేషన్ బియ్యం‌ తింటే ఇన్ని ఉపయోగాలా? తెలియక అనవసరంగా అమ్మేస్తున్నారు కదా

First Published Oct 25, 2024, 2:07 PM IST

రేషన్ బియ్యం అమ్ముకొని మంచి పాలిష్ పట్టిన బియ్యం కొనుక్కొని తింటున్నారా? మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు తెలియడం లేదు. గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ బియ్యం శక్తి తెలిస్తే మీరు రేషన్ బియ్యం అస్సలు అమ్మరు. పైగా రోజూ ఆ బియ్యం తినడానికే ఇష్టపడతారు. అసలు రేషన్ బియ్యంలో ఏమేమి పోషకాలు ఉన్నాయి? ఆ బియ్యం తింటే కలిగే ప్రయోజనాలు గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

ప్రజలకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రేషన్ కార్డుల ద్వారా బియ్యం, పంచదార, నూనె, మొదలైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి. ఈ పథకం దేశంలోని అనేక రాష్ట్రాల్లో అమలవుతోంది. ముఖ్యంగా పేద కుటుంబాలకు(Below poverty line) పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అర్హులకు ఇంటింటికీ వెళ్లి సిబ్బంది రేషన్ సరుకులు అందిస్తున్నారు. 
 

అయితే రేషన్ బియ్యం అందరికీ ఇవ్వరు. కేవలం ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. సంవత్సర ఆదాయం రూ.1.20 లక్షలకు లోపు ఉన్న వారికి, కుటుంబాల ఆసరా లేకుండా జీవిస్తున్న వారికి, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు, ఒంటరి మహిళలు ఇలా కొన్ని ప్రత్యేక కేటగిరీలు ఉన్న వారికి మాత్రమే రేషన్ బియ్యం సరఫరా చేస్తారు. 
 

Latest Videos


రేషన్ బియ్యం తీసుకొనే చాలామంది ఆ బియ్యాని వండరు. బియ్యం లావుగా ఉంటుందని, జావలా, ముద్దగా మారుతుందని ఆ బియ్యం వండటానికి ఇష్టపడరు. అంతేకాకుండా కొందరు పురుగులు ఉంటాయని అందువల్ల ఈ బియ్యం మంచివి కావని వంటకు ఉపయోగించరు. అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే ఈ రేషన్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధికారులు ప్రత్యేకంగా కొన్ని రకాల విటమిన్లు, మినరల్స్ మిక్స్ చేయించి వీటిని అర్హులైన పేదలకు పంపిణీ చేయిస్తున్నారు. 

ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్  న్యూట్రిషన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఈ బియ్యంలో నేచురల్ గా వచ్చే పోషకాలతో పాటు జింక్, విటమిన్ ఎ, థైయమిన్, రెబోఫ్లోమిన్, న్యాసిన్, విటమిన్ బి6 పోషకాలు ప్రత్యేకంగా కలుపుతారు. ఇన్ని పోషకాలున్న బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. 

ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది. అదేవిధంగా చిన్న పిల్లల్లో రోగనిరోధన శక్తి పెరుగుతుంది. చిన్ననాటి నుంచి ఈ బియ్యం తినడం అలవాటు చేస్తే ఎముకలు బలంగా తయారవుతాయి. పెద్దలకు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవు. 
 

ఇన్ని పోషకాలు ఉన్న బియ్యాన్ని అమ్ముకొని పాలిష్ చేసిన తెల్లటి బియ్యం తినడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, అజీర్ణం, ఆయాసం, షుగర్, వంటి అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మీకు తెలియని మరో విషయం ఏమిటంటే మీరు అమ్మిన రేషన్ బియ్యాన్ని బ్రోకర్లు కొని వాటినే పాలిష్ పట్టించి మళ్లీ మార్కెట్ లోకి వదులుతున్నారు. ఆ బియ్యాన్నే రెట్టింపు డబ్బులు పెట్టి కొని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఇక నుంచైనా ప్రభుత్వాలు అందించే నాణ్యమైన బియ్యం తిని ఆరోగ్యంగా ఉండండి. 
 

click me!