దేశవ్యాప్తంగా UPI ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ఉపయోగించి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తున్నారు. డిజిటల్ మనీ లావాదేవీలు నిర్వహించడంలో దేశ ప్రజలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారని కేంద్ర ప్రభుత్వ మంత్రులే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క రూపాయి నుంచి రూ.లక్షల్లో ట్రాన్సాక్షన్స్ కూడా యూపీఐ ద్వారా చేసేస్తున్నారు. డబ్బులు పంపడం, తీసుకోవడం ఇంత సులవైపోయినా అప్పుడప్పుడూ యూపీఐ సర్వర్ మోరాయిస్తుంటుంది. అలాంటప్పుడు డబ్బులు పోతాయేమోనని భయపడకండి. డబ్బులు సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.