అంతేకాదు ఎన్డిటివిలో అదనంగా 26 శాతం షేర్లను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్తో ముందుకు వచ్చినట్లు అదానీ గ్రూప్ కూడా తెలిపింది. ఇందులో అదానీ గ్రూప్ విజయవంతమైతే, ఎన్డిటివిలో దాని మొత్తం వాటా 55.18 శాతానికి పెరుగుతుంది. అంతేకాదు అతిపెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ప్రస్తుతం, NDTV గ్రూప్ అతిపెద్ద వాటాదారులు దాని వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్ ఉన్నారు. ఎన్డిటివిలో వారికి 32 శాతం వాటాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.