మరీ ముఖ్యంగా కోర్ట్ ఉత్తర్వుపై విజయ్ మాల్యాకి రి- అప్పీల్ చేయడానికి లేదా తాత్కాలిక స్టే ఇవ్వడానికి అనుమతిని తిరస్కరించారు.
బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్లో 2012లో మాల్యా ఫ్యామిలీ ట్రస్ట్ యాజమాన్యంలోని రోజ్ క్యాపిటల్ వెంచర్స్ 20.4 మిలియన్ పౌండ్ల రుణం కోసం ఐదేళ్లపాటు ఈ ప్రాపర్టీని యూబీఎస్కు తనఖా(mortgaged) పెట్టింది. 2017లో రుణం గడువు ముగిసీన బకాయిలు చెల్లించలేదు.
ఇదిలా ఉండగా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న వారి ఆస్తుల విక్రయం నుండి రుణదాతలు(banks) రూ. 13,109.17 కోట్లను రికవరీ చేశాయని గత నెల చివర్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.