Business Ideas: ఉన్న ఊరిలోనే ఈ చెట్లను పెంచి నెలకు లక్షల్లో సంపాదిస్తున్న రైతు..పూర్తి వివరాలు తెలుసుకోండి..

First Published Oct 17, 2022, 11:57 PM IST

ఉన్న ఊరిలో నెలకు లక్షల్లో సంపాదిస్తే  అంతకన్నా స్వర్గం మరొకటి ఉండదేమో, కానీ అదంతా ఒక కల అది అంతా అనుకుంటారు. ఆ కలను కూడా నిజం చేసుకున్న కొందరు రైతుల విజయగాథలు మనకు స్ఫూర్తిని ఇస్తాయి. అలాంటి ఓ రైతు గురించి తెలుసుకుందాం.

dates

ఖర్జూరం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది గల్ఫ్ దేశాలు.  ఈ ఎడారి దేశాల్లో ఖర్జూరం పంట విపరీతంగా పండుతుంది. ఇక్కడి నుంచి  ప్రపంచమంతా  ఖర్జూర పండు ఎగుమతి అవుతుంది.  ఖర్జూరం ఎడారిలో తప్ప మరి ఎక్కడా పండదనే  అపోహ ఉంది.  మన దేశంలో సైతం కొందరు రైతులు విజయవంతం ఖర్జూరం సాగు చేస్తోంది లక్షలు సంపాదిస్తున్నారు కర్ణాటక  చెందిన ఓ రైతు ఖర్జూరం సాగు చేస్తూ తన కల సాకారం చేసుకున్నాడు.
 

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరుకు చెందిన  దివాకర్ చెన్నప్ప అనే రైతు ఇందుకు నిదర్శనంగా నిలిచాడు. ధర్మపురికి చెందిన రైతు నిజాముద్దీన్ బెంగుళూరులోని జికెవికె కృషి మేళాలో దక్షిణ భారతదేశంలో ఖర్జూరం పెరగడానికి గల అవకాశాల గురించి సమాచారాన్నివివరించారు.

 ఈ మేళాలో పాల్గొన్న దివాకర్ చెన్నప్ప అనే 44 ఏళ్ల రైతు తన ప్రసంగంతో స్ఫూర్తి పొందారు. తాను కూడా కర్జూరం పండించి ఆదర్శంగా నిలవాలని అనుకున్నాడు. ముందుగా తమిళనాడులోని నిజాముద్దీన్ పొలాన్ని సందర్శించిన చెన్నప్ప అక్కడ ఖర్జూర పంట విజయవంతమవడం చూసి ఆశ్చర్యపోయాడు.

అప్పుడు 150 టిష్యూ కల్చర్ చేసిన ఖర్జూర విత్తనాలను తెచ్చి గౌరీబిదనూరులోని ముదగకుంటెలో దివాకర్ కు చెందిన రెండెకరాల భూమిలో నాటాడు. ఇక్కడి వాతావరణం నేల పరిస్థితులు ఖర్జూర పంటలను పండించే విధంగానే ఉండటంతో, ఫలితం లభించిందని దివాకర్ చెన్నప్ప చెప్పారు. మొదటి పంటను పొందడానికి వరుసగా నాలుగు సంవత్సరాలు పట్టింది. ప్రారంభ పంట దాదాపు 800-1,000 కిలోల ఖర్జూరం లభించింది. కానీ ఇప్పుడు నేను సంవత్సరానికి 5 టన్నుల ఖర్జూరాన్ని పండిస్తున్నట్లు దివాకర్ తెలిపారు. 

dates

దివాకర ఖర్జూరాన్ని మార్కెట్లలో లేదా దుకాణాల్లో విక్రయించడు. బెంగళూరులోని కస్టమర్ల ఇళ్లకు డేట్స్ డెలివరీ చేస్తాడు. దాదాపు 300 నుంచి 400 మందికి ఖర్జూరాలను దివాకర్ డెలివరీ  చేస్తుంటారు. ఖర్జూరాన్ని కిలో రూ.310కి విక్రయిస్తుంటాడు చెన్నప్ప.  గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు నేరుగా డెలివరీ చేయడం ద్వారా మధ్య దళారీల కు కమిషన్ ఇవ్వాల్సిన పనిలేదు.  నేరుగా కస్టమర్ కే  తక్కువ ధరకు విక్రయించడం వల్ల,  చాలామంది ఇది రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు. 

click me!