హైస్పీడ్, ఎక్స్ప్రెస్, ప్రత్యేక రైళ్లతో సహా ఇతర రైల్వే సేవల్లోనూ IRCTC డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం విద్యార్థులు, అంధులు, వికలాంగులు, పారా పెలాజిక్, క్షయ, క్యాన్సర్ రోగులు, కిడ్నీ, లెప్రసీ రోగులకు ఛార్జీల్లో రాయితీలు ఇస్తారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన భద్రతా బలగాల జీవిత భాగస్వాములు, యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు, జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులు, లేబర్ అవార్డు గ్రహీతలు, పోలీసు అమరవీరుల భార్యలు, సీనియర్ సిటిజన్లు రైల్వే టిక్కెట్ ధరల్లో రాయితీలు పొందడానికి అర్హులు. ఇలా ప్రతి ఒక్కరికీ IRCTC టికెట్ ధరల్లో డిస్కౌంట్ ఇస్తుంటుంది. అందువల్ల మీకు టికెట్ ధరల్లో తగ్గింపు కావాలంటే IRCTC బెస్ట్ ఆప్షన్.