అన్యాయమైన వ్యాపార విధానాలకు పాల్పడినందుకు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (CCI) గూగుల్కు రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా సంస్థ, దేశంలోని కార్పొరేషన్లు న్యాయమైన పద్ధతిలో వ్యాపారం చేస్తున్నాయో లేదో పర్యవేక్షించి, నియంత్రిస్తుంది. దాని ఆధారంగా ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ గూగుల్ పై సీసీఐ రూ.1,337 కోట్ల జరిమానా విధించింది.