ఈ జాబితాలో 47 ర్యాంక్తో తదుపరి మహిళా పారిశ్రామికవేత్తగా బైజు సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్నాథ్ (35) ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడడంతో పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు ఆన్లైన్ టీచింగ్ లోకి మారిన తరువాత బైజు వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లు వేగంగా పెరిగాయి. శ్రీమతి గోకుల్నాథ్ సంపద గత సంవత్సరంలో 1 బిలియన్ (దాదాపు రూ. 7,477 కోట్లు) పెరిగి 4.05 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.02 లక్షల కోట్లు) పెరిగింది.