నేడు హిందాల్కో, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఎన్ఎస్ఇలో ఎన్టిపిసి, సిప్లా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అగ్రస్థానంలో ఉన్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 1.40 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.41 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ముగిశాయి. కరెన్సీ మార్కెట్లో 2021 చివరి ట్రేడింగ్ రోజు యూఎస్ డాలర్తో రూపాయి 13 పైసలు పెరిగి 74.29 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది.