GST council 46th meeting:బట్టలపై జి‌ఎస్‌టి రేటు పెంపు వాయిదా, పాదరక్షల ధరపై కీలక నిర్ణయం..

Ashok Kumar   | Asianet News
Published : Dec 31, 2021, 04:06 PM IST

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitaraman)నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ (gst council)46వ సమావేశం నేడు ముగియగా, ఈ సమావేశ ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించారు. అంతకుముందు సమావేశం తర్వాత తీసుకున్న నిర్ణయాల గురించి చెబుతూ హిమాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి (industrial minister)బిక్రమ్ సింగ్ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. 

PREV
14
GST council 46th meeting:బట్టలపై జి‌ఎస్‌టి రేటు పెంపు వాయిదా, పాదరక్షల ధరపై కీలక నిర్ణయం..

దుస్తులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంపుదల చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే  జి‌ఎస్‌టి కౌన్సిల్ 2022 ఫిబ్రవరిలో జరిగే తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని సమీక్షిస్తుంది.


జి‌ఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో చాలా రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేశాయి, దీంతో దుస్తులపై జి‌ఎస్‌టి రేట్ల పెంపును ఫిబ్రవరి 2022 వరకు వాయిదా వేశారు. గమనార్హమైన విషయం ఏంటంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాలు ఈ చర్యను వ్యతిరేకించడంతో జి‌ఎస్‌టి కౌన్సిల్ తన నిర్ణయాన్ని నిలిపివేసేందుకు నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంకా రాష్ట్రాల సహచరుల అధ్యక్షతన జరిగిన జి‌ఎస్‌టి కౌన్సిల్ 46వ సమావేశంలో  తదుపరి సమావేశంలో సమస్యను మరింతగా పరిశీలించాలని నిర్ణయించింది.
 

24

ఫ్యాబ్రిక్స్‌పై జిఎస్‌టి రేటు
ప్రస్తుతం, మ్యాన్ మేడ్ ఫైబర్ (MMF) పై జిఎస్‌టి రేటు 18 శాతం, నూలుపై 12 శాతం, ఫ్యాబ్రిక్‌పై 5 శాతం చొప్పున వర్తిస్తుంది. సెప్టెంబర్ 17న జరిగిన చివరి సమావేశంలో పాదరక్షలు, టెక్స్‌టైల్ రంగాల్లో జీఎస్టీ రేటును మార్చాలని కౌన్సిల్ నిర్ణయించింది.

34

కొత్త సంవత్సరం నుండి పాదరక్షలపై
జనవరి 1, 2022 నుండి  పాదరక్షల ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలు 12 శాతం జి‌ఎస్‌టిని ఆకర్షిస్తాయని జి‌ఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అంటే షూ విలువ రూ. 100 లేదా రూ. 1000 అయినా అన్నింటిపైనా 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తారు. దీనితో పాటు, రెడీమేడ్ వస్త్రాలు సహా కాటన్ మినహా వస్త్ర ఉత్పత్తులపై 12 శాతం ఒకే జీఎస్టీ రేటును కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. 

44

శ్లాబ్‌ తగ్గింపుపై నిర్ణయం 
నేటి సమావేశంలో శ్లాబులను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 12 శాతం, 18 శాతం శ్లాబుల విలీనంపై చర్చించినా దానిపై నిర్ణయం తీసుకోలేదు. నివేదిక ప్రకారం, ఇప్పుడు పాదరక్షలపై పన్ను తగ్గించడం, రెండు శ్లాబ్‌లను విలీనం చేసే ఆలోచన కౌన్సిల్ తదుపరి సమావేశంలో పరిగణించనుంది.
 

click me!

Recommended Stories