నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.60 వద్ద ముగిసింది. నేడు నిఫ్టీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, యుపిఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు ఎక్కువ లాభపడితే.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సీప్లా, ఎస్బీఐ షేర్లు ఎక్కువ నష్టపోయాయి. రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఎనర్జీ, ఐటీ, మెటల్ సూచీలు 1-3 శాతం పెరగడంతో మార్కెట్ లాభాల్లో ముగిసింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి.