అలాంటి వ్యాపారుల్లో సియా రామ్ ఒకరు. ఆయన ఢిల్లీలో ఘుగ్ని, ఛోలే కుల్చా(చాట్ బఠాని, జొన్నరొట్టెలు) అమ్మి రోజుకు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నానని చెబుతున్నారు. ఆయన ఈ వ్యాపారాన్ని 60 ఏళ్లుగా చేస్తున్నారట. అందువల్ల ఆయన ఢిల్లీ లో చాలా ఫేమస్ వ్యక్తిగా మారిపోయారు. ఢిల్లీలో ఉండేవారు కాని, అక్కడికి పనులపై వచ్చిన వారు కాని కచ్చితంగా సియా రామ్ దగ్గరకు వచ్చి ఘుగ్ని తినేసి వెళతారు. అంతలా ఆయన ఫేమస్ అయ్యారు.