2023-24 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ₹5,101 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో, ఒక సంవత్సరం క్రితం అంటే 2022-23లో ఇదే కాలంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ₹4,682 కోట్లు ఖర్చు చేసింది. మాణికం ఠాకూర్ ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో, “ఆర్థిక మంత్రి గారూ, కోట్లాది మంది పౌరులను, ముఖ్యంగా గ్రామీణ , పట్టణ పేద వర్గాలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన సమస్యపై మీ దృష్టిని ఆకర్షించాలని నేను కోరుకుంటున్నాను. ₹10, ₹20 , ₹50 నోట్ల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది.