ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11, 2024న 26వ ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ సంతకం మార్పు మొదటి చర్యగా నమోదవుతోంది.
రూ.20 కొత్త నోట్ల ముఖ్యాంశాలు:
63 మిమీ x 129 మిమీ పరిమాణంలో ఆకుపచ్చ పసుపు కలయిక రంగులో ఉండనుంది. ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రపటం, దేవనాగరి లిపిలో అంకె, గవర్నర్ సంతకం, ఆర్బీఐ లోగో, జాతి ప్రతీక (అశోక స్తంభం), మైక్రోలెటరింగ్ ఉంటాయి. అలాగే, భద్రతా థ్రెడ్ పై 'भारत, RBI' అక్షరాలు ఉంటాయి. ఇక వెనుక భాగంలో ఎల్లోరా గుహలు చిత్రాన్ని మోటిఫ్గా వాడడం, నోటు ముద్రించిన సంవత్సరం, భాషా ప్యానెల్, స్వచ్ఛ భారత్ లోగో ఉండనున్నాయని సమాచారం.