UPI ట్రాన్సాక్షన్స్ ఇకపై చాలా సింపుల్: RBI కీలక మార్పులివే

First Published Oct 11, 2024, 8:23 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై కీలకమైన మార్పులు చేసింది. మనం ఏ వస్తువు కొన్నా పేమెంట్స్ అన్నీ డిజిటల్ విధానంలో చేస్తున్నాం కదా. అందుకే ఈ సేవలు మరింత సులభం చేసేందుకు ఆర్బీఐ కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకోనేందుకు ఈ స్టోరీ పూర్తిగా చదవండి. 
 

యూపీఐ లైట్(UPI Lite) ప్రతి ట్రాన్సాక్షన్ లిమిట్ ను  రూ.500 నుండి రూ.1,000కి పెంచుతూ RBI ప్రకటన చేసింది. దీంతో పాటు యూపీఐ లైట్ కు చెందిన వాలెట్ రీఛార్జ్ చేసే లిమిట్ ను రూ.2,000 నుండి రూ.5,000కి పెంచారు. UPI 123PAY పరిమితిని కూడా రూ. 5,000 నుండి రూ. 10,000కి ఆర్బీఐ పెంచింది. 
 

RBI గవర్నర్ ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.  UPI ప్రాసెస్ ప్రారంభించినప్పటి నుంచి డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇది భారతదేశ ఆర్థిక రంగాన్ని మార్చింది. అందుకే UPI ట్రాన్సాక్షన్ మరింత సింపుల్ చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. UPI123చెల్లింపులో ప్రతి లావాదేవీ పరిమితి రూ. 5,000 నుండి రూ. 10,000కి, UPI లైట్ వాలెట్ పరిమితిని రూ. 2,000 నుండి రూ. 5,000కి పెంచారు. ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 500 నుండి రూ. 1,000కి పెంచారు. 
 

Latest Videos


అసలు ఏంటీ UPI లైట్, UPI లైట్ వాలెట్ 

ఏదన్నా కొన్నా, ఎవరికైనా డబ్బులు పంపిచాలన్నా యూపీఐ పిన్ నమోదు చేయకుండానే చెల్లింపులు చేయడానికి UPI లైట్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇటువంటి UPI ఒక్కో లావాదేవీకి రూ.500 వరకు మాత్రమే లిమిట్. ఇకపై ఒక వ్యక్తి UPI పిన్ లేకుండానే రూ.1000 వరకు సింపుల్ గా సెండ్ చేయొచ్చు.  UPI లైట్ ద్వారా చేసే లావాదేవీలు వ్యక్తి బ్యాంక్ పాస్‌బుక్‌లో రాయరు. అయితే ఒక వ్యక్తి UPI లైట్ లావాదేవీలను తనిఖీ చేయడానికి వారి UPI యాప్ ట్రాన్సాక్షన్ హిస్టరీని తనిఖీ చేయవచ్చు.

UPI లైట్ సదుపాయాన్ని ఉపయోగించడానికి ఒక వ్యక్తి యూపీఐ లైట్ వాలెట్‌లో డబ్బులు వేయాల్సి ఉంటుంది. ఈ యూపీఐ లైట్ వాలెట్ BHIM, Google Pay, PhonePe మొదలైన యాప్‌లలో అందుబాటులో ఉంది. UPI PINని నమోదు చేయకుండానే లావాదేవీలు చేయడానికి ఒక వ్యక్తి UPI లైట్ వాలెట్‌లో రూ. 2,000 వరకు ఉంచకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి చెల్లింపులు చేయడానికి UPI లైట్ వాలెట్‌లో రూ. 5,000 వరకు మెయిన్‌టెయిన్ చేయవచ్చు. 

UPI 123PAY అనేది ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన UPI చెల్లింపు సౌకర్యం. అంటే స్మార్ట్‌ఫోన్‌లు లేని వారు సాధారణ UPI చెల్లింపులు చేయడానికి  అవకాశం ఉండదు. అయితే UPI 123PAY ద్వారా సింపుల్ గా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా UPI చెల్లింపులను చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. UPI 123Payని సెటప్ చేయడానికి డిజిటల్ చెల్లింపులు, *99# డయల్ చేయాలి. తర్వాత బ్యాంక్‌ను ఎంచుకోవడం, వారి డెబిట్ కార్డ్ వివరాలను నమోదు చేయడం UPI PINని సెట్ చేయాలి. తద్వారా UPI IDని క్రియేట్ అవుతుంది. దీని ద్వారా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేకపోయినా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. UPI 123Pay భారతదేశంలోని 400 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం రూపొందించామని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. 
 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ సౌకర్యం కోసం ఆటో-టాప్ అప్ సౌకర్యాన్ని ప్రకటించింది. దీని ప్రకారం UPI లైట్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా రీలోడ్ అవుతుంది, ఈ ఆప్షన్ అవసరం లేదనుకుంటే ఆటో టాప్ అప్ ఆదేశాన్ని ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 31, 2024 లోపు యాప్‌లలో కొత్త ఆటో-టాప్ అప్ సదుపాయాన్ని తప్పనిసరిగా వినియోగించాలి. 
 

click me!