అలాంటి రతన్ టాటా జీవితంలో శాంతను నాయుడు కీలకమైన వ్యక్తి. యువ వ్యాపారవేత్తగా రతన్ టాటా దగ్గరకు వచ్చిన శాంతను నాయుడు ఆయన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తిగా మారిపోయారు.
గతంలో శాంతను నాయుడు గుడ్ఫెలోస్ అనే సంస్థను ప్రారంభించారు. దీనిలో రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. శాంతను ఆలోచనలు, సమాజానికి మేలు చేయాలన్న ఉత్సాహం రతన్ టాటాను బాగా ఇంప్రస్ చేశాయి.
తనకు మేనేజర్ గా ఉండమని శాంతనును రతన్ టాటా కోరడంతో ఆయన వద్ద చేరారు. ఇద్దరి ఐడియాలజీ ఒకేలా ఉండటంతో చాలా తక్కువ టైమ్ లో రతన్ టాటా, శాంతను నాయుడు తండ్రి, కొడుకుల్లా కలిసి జీవించారు.