10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముద్రా
పీఎం ముద్రా యోజన స్కీమ్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు పూచికత్తు లేని లోన్లను ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఇస్తున్నాయి. అంతేకాదు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా ముద్రా లోన్లు ఇస్తున్నాయి.
పీఎం ముద్రా యోజన కింద ఎంత లోన్ ఇస్తారు?
ముద్రా లోన్లు శిశు, కిషోర్, తరుణ్ అనే 3 రకాలుగా ఇస్తారు. శిశు కేటగిరీలో రూ.50,000 వరకు, కిషోర్ కేటగిరీలో రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్లు ఇస్తారు. దీనితో పాటు తరుణ్ ప్లస్ అనే మరో కేటగిరీ కూడా ఉంది. ఇంతకు ముందు తీసుకున్న లోన్లను కరెక్ట్ టైమ్ లో కడితే తరుణ్ ప్లస్ కేటగిరీలో రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.