ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీగా ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.
బిట్కాయిన్ను ఉదాహరణగా చూపుతూ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్లో ప్రసంగించారు. బిట్కాయిన్ను ఉదాహరణగా చూపుతూ, క్రిప్టోకరెన్సీల వంటి టెక్నాలజి ఆవిష్కరణలను దుర్వినియోగం చేయరాదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే మన యువతను పాడుచేసే బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీ తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యం.