సెప్టెంబరు 28 నుండి మూడు వారాల ధరల రివిజన్ ముగిసిన తర్వాత పెట్రోల్ ధర 20 సార్లు పెరిగింది. సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధరలు 23 సార్లు పెంచబడ్డాయి. ఒక్క అక్టోబర్ నెలలో 18 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటివరకు అక్టోబర్ నెలలో 6 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
అంతకు ముందు మే 4 నుండి జూలై 17 మధ్య పెట్రోల్ ధర లీటరుకు రూ .11.44 పెరిగింది. డీజిల్ ధర లీటరుకు రూ.9.14 పెరిగింది.
హైదరాబాద్లో లీటరు పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్పై 38 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.111.55, డీజిల్ రూ.104.70గా ఉంది.