గాడిద చర్మాలతో పాటు పలు వస్తువులను చైనాకు ఎగుమతి చేసేందుకు పాకిస్థాన్ మంగళవారం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్కు చెందిన ARY న్యూస్ ఈ సమాచారాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పశువులు, పాల ఉత్పత్తులు, మిరపకాయలు, గాడిద చర్మాల ఎగుమతి కోసం చైనాతో నాలుగు ప్రోటోకాల్లపై సంతకం చేయడానికి పాకిస్తాన్ కేంద్ర మంత్రివర్గం సిద్ధంగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా గాడిద చర్మాన్ని ప్రాసెసింగ్ కోసం చైనాకు పంపనున్నట్లు తెలిపింది. ARY న్యూస్ ప్రకారం, చైనా, పాకిస్తాన్ సంతకం చేసే నాలుగు ప్రోటోకాల్లను లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదించింది.