మ్యారేజ్ లోన్స్ కావాల్సిన వారు 21 నుంచి 60 ఏళ్ల వయసున్న భారతీయ పౌరులై ఉండాలి. జాబ్ చేసే వాళ్లయితే కనీసం రూ.15000 జీతం అంతకంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారికి మ్యారేజ్ లోన్స్ వస్తాయి. ఒక వేళ మీరు ఈ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే సాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డు, ఓటరు ఐడి, పాన్ కార్డ్ జిరాక్సులు బ్యాంకు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే క్రెడిట్ స్కోర్ కచ్చితంగా 750, అంతకంటే ఎక్కువ ఉండాలి.