ఆఫీస్ సిబ్బంది నుండి ఈ విషయం విన్న తర్వాత అర్థం చేసుకున్నాను: నీతా అంబానీ

First Published Oct 9, 2020, 5:58 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ స్కూల్స్, హాస్పిటల్ అలాగే ఐపిఎల్ క్రికెట్ టీమ్ వ్యవహారాలను చూసుకోవడంతో పాటు వారి ఇంటిని కూడా చూసుకుంటుంది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడి భార్య అయిన నీతా అంబానీ వ్యాపార ప్రపంచంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సాధించింది.

ప్రపంచంలోని బలమైన మహిళలలో నీతా అంబానీ కూడా ఒకరు. ఏ సామాన్యుడైనా కుటుంబం, వ్యాపారం మధ్య సమతుల్యతను చూసుకోవడం చాలా కష్టం. ఆలాంటి విషయంలో నీతా అంబానీ వాటిని బాగా నిర్వహిస్తుంది.
undefined
ఒక ఇంటర్వ్యూలో నీతా అంబానీ తాను ఆఫీస్ పనులను అలాగే కుటుంబాన్ని ఎలా నిర్వహిస్తుందో చెప్పింది.
undefined
నీతా అంబానీ ప్రకారం, ఆమె తన వ్యాపార పనులను ఎప్పుడూ ఇంటికి వరకు తీసుకురాదట. ఆఫీసు పనులు ఆఫీసులో, ఇంటి పనులు ఇంట్లో ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
undefined
నీతా అంబానీ మాట్లాడుతూ కుటుంబం మొత్తం కూర్చుని కనీసం రోజులో ఒక్కసారైనా భోజనం చేసేలా చూసుకుంటుందట. ముఖేష్ అంబానీ రాత్రి ఏ సమయంలోనైనా ఇంటికి వచ్చిన తరువాత తప్పకుండ కలిసి విందు చేస్తారు అని చెప్పింది.
undefined
నీతా అంబానీ ఒకప్పుడు పాఠశాల ఉపాధ్యాయురాలు, పిల్లలు, పెద్దలు అందరితో కమ్యూనికేట్ చేయడంలో చాలా మంచిదని నీతా అంబానీ చెప్పారు.
undefined
నీతా అంబానీ ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సిబ్బంది ఒకరు ఆఫీస్ కి ఆలస్యంగా వచ్చినప్పుడు అడిగితే బస్సు ఆలస్యం అయిందని చెప్పారు ఆమెకు అప్పుడు సమస్య అర్థమైంది. తాను కూడా ఒకప్పుడు బస్సుల్లో చాలా ప్రయాణించానని, దీనివల్ల ఎవరైనా ఆలస్యం కావచ్చని దానిని అర్థం చేసుకున్నానని నీతా అంబానీ అన్నారు.
undefined
click me!