ఇండియన్ టాప్ 100 ధనవంతులలో 5 మంది మహిళలు.. నీతా అంబానికి దక్కని చోటు..

First Published Oct 9, 2020, 2:09 PM IST

భారతదేశపు టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో ఎక్కువ మంది పురుషులు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, 5 మంది మహిళలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నీతా అంబానీ పేరు ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చేర్చలేదు. 

సావిత్రి దేవి జిందాల్ మహిళల్లో అగ్రస్థానంలో ఉన్నారు: ఫోర్బ్స్ ఇండియా ప్రకారం జిందాల్ గ్రూప్ ఛైర్మన్ సావిత్రి దేవి జిందాల్ దేశంలోని మహిళల్లోఅత్యంత ధనవంతురాలు. ఫోర్బ్స్ ప్రకారం సావిత్రి జిందాల్ సంపద 6.6 బిలియన్ డాలర్లు. 100 మంది ధనవంతుల జాబితాలో సావిత్రి జిందాల్ 19వ స్థానంలో ఉంది. సావిత్రి జిందాల్ సంపద గత సంవత్సరంలో 0.8 బిలియన్ డాలర్లు పెరిగింది. గత సంవత్సరం, ఫోర్బ్స్ రిచ్ ఇండియన్స్ జాబితాలో సావిత్రి జిందాల్ 5.8 బిలియన్ డాలర్ల నికర విలువతో 20వ స్థానంలో నిలిచింది.
undefined
కిరణ్ మజుందార్ షా ఆస్తి రెట్టింపు: బయోకాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా దేశంలో రెండవ అత్యంత ధనవంతురాలు. ఫోర్బ్స్ సంపన్న భారతీయుల జాబితాలో కిరణ్ మజుందార్ షా 27వ స్థానంలో ఉన్నారు. కిరణ్ మజుందార్ షా ఆస్తులు గత ఏడాదిలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఫోర్బ్స్ ప్రకారం కిరణ్ మజుందార్ షా 4.6 బిలియన్ డాలర్ల ఆస్తిని కలిగి ఉన్నారు. కాగా, 2019లో 2.38 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ రిచ్ ఇండియన్స్ జాబితాలో కిరణ్ మజుందార్ షా 54 వ స్థానంలో ఉన్నారు.
undefined
వినోద్ రాయ్ గుప్తా మూడవ ధనవంతురాలు: హావెల్స్ ఇండియాకు చెందిన వినోద్ రాయ్ గుప్తా దేశంలో మూడవ ధనవంతురాలు. ఫోర్బ్స్ సంపన్న భారతీయుల జాబితాలో వినోద్ రాయ్ గుప్తా 40వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, వినోద్ రాయ్ గుప్తాకు 3.55 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. అయితే వినోద్ రాయ్ గుప్తా ఆస్తులు గత ఏడాదిలో 0.45 బిలియన్ డాలర్లు తగ్గాయి. 2019లో ఫోర్బ్స్ రిచ్ ఇండియన్స్ జాబితాలో వినోద్ రాయ్ గుప్తా 4 బిలియన్ డాలర్ల నికర విలువతో 29వ స్థానంలో నిలిచారు.
undefined
లీనా తివారీ: యుఎస్‌వి ఇండియాకు చెందిన లీనా తివారీ దేశంలో నాల్గవ ధనవంతురాలు. ఫోర్బ్స్ సంపన్న భారతీయుల జాబితాలో 3 బిలియన్ డాలర్ల ఆస్తులతో లీనా తివారీ 47 వ స్థానంలో ఉంది. గత ఒక సంవత్సరంలో, లీనా తివారీ సంపద 1.08 బిలియన్ డాలర్లు పెరిగింది. 2019 లో యుఎస్‌వి ఇండియాకు చెందిన లీనా తివారీ 1.92 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ రిచ్ ఇండియన్స్ జాబితాలో 71 వ స్థానంలో నిలిచింది.
undefined
మల్లికా శ్రీనివాస్: ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (టాఫే) కు చెందిన మల్లికా శ్రీనివాస్ దేశంలో ఐదవ ధనవంతురాలు. ఫోర్బ్స్ ప్రకారం మల్లికా శ్రీనివాస్ 2.45 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ఫోర్బ్స్ యొక్క ధనిక భారతీయుల జాబితాలో మల్లికా శ్రీనివాసన్ 58 వ స్థానంలో ఉంది. మల్లికా శ్రీనివాస్ సంపద గత ఏడాదిలో 0.35 బిలియన్ డాలర్లు పెరిగింది. 2019 లో ఫోర్బ్స్ రిచ్ ఇండియన్స్ జాబితాలో మల్లికా శ్రీనివాస్ 64వ స్థానంలో నిలిచారు, ఆమే మొత్తం సంపద 2.1 బిలియన్ డాలర్లు.
undefined
click me!