త్వరలో ముంబైకి..
భారతదేశానికి రాకముందు ఈ ప్రైవేట్ జెట్ బేసెల్, జెనీవా, లండన్, లుటన్ విమానాశ్రయాల్లో టెస్టింగ్ చేశారు. ఆగస్టు 27, 2024న, బోయింగ్ 737 Max 9 బేసెల్ నుండి ఢిల్లీకి వచ్చింది. ఈ విమానం 9 గంటల్లో 6,234 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ బోయింగ్ విమానం దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన, ఖరీదైన ప్రైవేట్ జెట్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అంబానీ కొత్త విమానం ఢిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలో ఉన్న నిర్వహణ టెర్మినల్లో ఉంది. రిలయన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైకి త్వరలో ఈ జెట్ రానుందని సమాచారం.