రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్రీమియం రేట్ సర్వీస్ ను ఉపయోగించుకొని స్కామ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని జియో గుర్తించి తన వినియోగదారులను హెచ్చరించింది.
ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. వినియోగదారులకు ఇంటర్నేషనల్ నంబర్స్ నుండి మిస్డ్ కాల్ వస్తుంది. దీంతో కాల్ బ్యాక్ చేశారంటే కాల్ ఛార్జీలు చాలా ఎక్కువగా పడతాయి. ఈ డబ్బులు స్కామర్ల అకౌంట్స్ కి వెళ్లిపోతాయి.